క్షుద్రపూజలు: మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి..

21 May, 2021 07:33 IST|Sakshi

యశవంతపుర: కరోనా పోవాలంటూ అపరిత వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఘటన హాసన జిల్లాలో జరిగింది. బేలూరు తాలుకా క్యాతనకెరె గ్రామం పొలిమేరలో మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి చీర, చేతి గాజులు, తాళి తొడిగి పసువు–కుంకుమతో పూజలు చేశారు. ఓ మేకను బలి ఇచ్చి అక్కడే వదిలి వెళ్లారు. గురువారం ఉదయం పూజలు, రక్తం చూసిన గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. స్థలాన్ని బేలూరు పోలీసులు పరిశీలించారు.

చదవండి: యువతి బ్లాక్‌మెయిల్‌: డబ్బులు పంపించు.. లేదంటే..     
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త 

మరిన్ని వార్తలు