కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!

12 Aug, 2020 08:29 IST|Sakshi

ఇంఫాల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన విప్‌ను ధిక్కరించి సోమవారం జరిగిన ఒక్క రోజు అసెంబ్లీ సమావేశానికి కొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.  గైర్హాజరైన 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు తమ రాజీనామాలను స్పీకర్‌ యుమ్నమ్‌ కెంచంద్‌ సింగ్‌కు సమర్పించారు. అయితే వీరిలో ఐదుగురి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ సభ్యత్వానికి కూడా రాజీనామాలు పంపారు.  బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో 29 ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్‌కు 24 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 8 మంది రాకపోవడంతో ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కింది.

చదవండి: మళ్లీ బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు