పెద్దలు వారిద్దరికీ వివాహం నిశ్చయించారు. పెళ్లి వేడుకకు బంధువులందరూ విచ్చేశారు. అటు మండపంలో పూజరి పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు. తన పెళ్లి తంతు కోసం వరుడు ఎంతో సంతోషంతో ఎదురుచూస్తున్నాడు. తీరా తాళి కట్టే సమయానికి వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన యూపీలో జరిగింది.
వివరాల ప్రకారం.. భద్వానా గ్రామానికి చెందిన రాజ్పాల్ కూతురు శివాంగికి వివేక్తో పెద్దలు పెళ్లి ఖయం చేశారు. పెళ్లి జరుగుతున్న క్రమంలో వధువు.. వరుడి మెడలో పూలమాల వేస్తున్న సందర్బంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో, అక్కడున్న వారంతా టెన్షన్కు గురయ్యారు. ఏం జరిగిందో.. అని అటు వరుడు కూగా కంగారుపడ్డారు.
అనంతరం, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శివాంగిని పరిశీలించిన వైద్యులు మార్గమధ్యంలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా, గుండెపోటు కారణంగా వధువు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, వధువు మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. వధువు మృతి తర్వాత దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఘటనా ప్రాంతానికి పంపామని మలిహాబాద్ స్టేషన్ అధికారి సుభాస్ చంద్ర సరోజ్ తెలిపారు.
Heart-breaking news coming in from Lucknow, Uttar Pradesh.
Daughter of Rajpal of Bhadwana village, Shivangi Sharma, the 21-year-old bride, collapsed during her wedding in Malihabad and dies of cardiac arrest. pic.twitter.com/y5eWHrAmbM
— Sanjay (@sanjaykumarpv) December 4, 2022