Viral Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్‌!

24 Nov, 2021 19:04 IST|Sakshi

వివాహం జరిగిన అనంతరం అదేరోజు ఓటు వేసిన వధువరుల జంటలను చూశాం. పెళ్లి జరిగిన తర్వాత పరీక్షలు రాసిన వధువరులకు సంబంధించిన వార్తలు వైరల్‌ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఓ వధువుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరికొన్ని గంటల్లో ఓ నవ వధువు పెళ్లిపీటల మీద కూర్చోవల్సి ఉండగా.. పెళ్లికూతురు అలంకరణతోనే ఎక్జామ్‌ సెంటర్‌ వెళ్లి పరీక్ష రాసింది. వివారాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన శివంగి బగ్తారియా అనే ఓ వధువు కొన్ని గంటల్లో తమ వివాహవేడుక ఉండగా.. అందమైన పెళ్లి దుస్తుల అలంకరణ, మేకప్‌తో శాంతినికేతన్‌ కాలేజ్‌ ఎక్జామ్‌ సెంటర్‌కు వెళ్లి తన యూనివర్సిటీ పరీక్షను రాసింది. 

అయితే ఆమె పెళ్లి వేడుక కంటే తన చదువకు ప్రాధాన్యత ఇస్తూ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన అనంతరం ఆమె నేరుగా వివాహ వేడుక జరిగే చోటుకు చేరుకొని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పరీక్ష రాస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 4 లక్షల మంది వీక్షించారు.

ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఆ వధువును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘పెళ్లి కంటే పరీక్షకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆమె నిర్ణయం సూపర్‌’.. ‘చాలా మందికి ఆ వధువు ఆదర్శంగా నిలుస్తుంది’.. ‘వధువు చేసిన పనికి అంతా షాక్‌ అయి ఉంటారు!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది మాత్రం నెటజన్లు పెదవి విరుస్తున్నారు. ‘వధువు పెళ్లిదుస్తుల్లో వచ్చి పరీక్ష రాయటం ఓ పబ్లిసిటీ స్టంట్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు