వార్షిక నివేదిక వెల్లడించిన బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్తానా

17 Jul, 2021 20:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్తానా శనివారం వార్షిక నివేదికను వెల్లడించారు. గతేడాది సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్‌, నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  రూ.2,786 కోట్ల విలువైన 632 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్నామని వెల్లడించారు. 55 తుపాకులు, 4223 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరిహద్దుల్లో 22 మంది చొరబాటుదారులను మట్టుబెట్టామని చెప్పారు. మొత్తం 165 మంది చొరబాటుదారులను అరెస్ట్‌ చేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు