కేంద్ర బడ్జెట్‌: ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలకు ఊరట

1 Feb, 2021 22:02 IST|Sakshi

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ 2021-22

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు (సోమవారం) పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్‌ పద్ధతిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు. బడ్జెట్‌ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. నిర్మలా సీతారామన్‌‌ ప్రసంగం అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

  • 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
  • 11వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్‌ నిర్మాణం
  • బెంగాల్‌లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధి
  • ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌
  • బడ్జెట్‌ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు
  • 20121-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం
  • 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతం
    2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయం

ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గానికి ఊరట

  • గృహరుణ మినహాయింపులు 2022, మార్చి 31 వరకు కొనసాగింపు
  • స్టార్టప్‌లకు ఇచ్చే తాయిలాలు మరో ఏడాది పొడిగింపు

పెరిగేవి.. తగ్గేవి

  • మరింత పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
  • లీటర్‌ డీజిల్‌పై రూ.4  వ్యవసాయ సెస్సు
  • పెట్రోల్ ‌లీటర్‌కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు
  • పెరగనున్న మొబైల్‌ ధరలు
  • అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ
  • ట్యాక్స్‌ ఆడిటింగ్‌ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
  • ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
  • 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
  • 5 % సెస్సు తగ్గింపుతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి
  • రాగిపై పన్ను మినహాయింపులు
  • పెరగనున్న సోలార్‌ ఇన్వెటర్ల ధరలు
  • ఆటోమొబైల్‌ రంగంలో కస్టమ్‌ డ్యూటీ పెంపు
  • పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
  • కాటన్‌పై 10శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
  • దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు
  • పెరగనున్న లెదర్‌ ఉత్పత్తుల ధరలు  
  • ఆదాయ పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట
  • ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు

సీనియర్‌ సిటిజన్లకు ఊరట

  • పన్ను చెల్లింపుదారుల 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారు.
  • 75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్‌‌కు  ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు
  • ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం
  • ఎన్నారైలు భారత్‌లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు
  • ఎన్‌ఐఆర్‌లకు డబుల్‌ టాక్సేషన్‌నుంచి ఊరట
  • పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు
  • అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు
  • ట్యాక్స్‌ ఆడిటింగ్‌ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
  • ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
  • 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
  • పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు

డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు

  • 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం
  • 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
  • ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ

  • 15 వేల పాఠశాలలు శక్తివంతం
  • కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు
  • ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
  • లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు

ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ

  • ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ
  • 2021-22లో పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణ 

రైతుల సంక్షేమం

  • రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది
  • వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు
  • 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ
  • కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
  • 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం
  • తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు
  • రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
  • 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
  • 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు

మౌలిక రంగానికి భారీగా నిధులు

  • గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు
  • తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు
  • విద్యుత్‌ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
  • పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు
  • ఉజ్వల స్కీమ్‌ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు
  • జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు
  • కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్‌ పంపిణీని పటిష్టం చేస్తాం
  • సొలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు
  • బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు

  • బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం
  • మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు
  • ఇక నుంచి బ్యాంకుల ఎన్‌పీఏలు బ్యాడ్‌ బ్యాంక్‌కు బదలాయింపు
  • ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
  • బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు
  • 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ
  • 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు
  • 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
  • జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు
  • కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల,400 కోట్లు
  • మెగా ఇన్వెస్ట్‌మెంట్‌  టెక్స్‌టైల్‌ పార్క్‌
  • కొత్తగా బీఎస్‌ఎల్‌-3  ప్రయోగశాలలు 9 ఏర్పాటు
  • మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు

20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే

  • వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి 
  • పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం
  • వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ

ఆత్మనిర్భర్‌ యోజన పథకం

  • 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ :  రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం
  • 6 సంవత్సరాలకు గాను  64వేల 180కోట్లరూపాయలతో  ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం
  • నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు 
  • ఆరోగ్య రంగానికి పెద్దపీట 
  • 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
  • కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం

యూనియన్‌ బడ్జెట్‌ యాప్‌

  • ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం
  • ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్‌, బడ్జెట్‌ యాప్‌ రిలీజ్‌ చేసిన కేంద్రం
  • అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం
  • లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం

ఆందోళనల నడుమ ప్రసంగం..

  • లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు.
  • టీమిండియా అద్భుత విజయాన్ని ఆమె ప్రస్తావించారు.
  • కేంద్ర బడ్జెట్ యూనియన్‌ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్   ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్‌ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో  ఆర్థికమంత్రి బడ్జెట్‌ను సభ ముందుంచునున్నారు.
  • మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్‌ ప్రతిని అందజేశారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరి వెళ్లారు. కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారు.
  • చరిత్రలో తొలిసారి పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను  ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌,  మేడ్‌ఇన్‌ ఇండియా  ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్‌లో చూసి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • మేడ్‌ఇన్‌ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్‌, అనురాగ్‌ఠాకూర్‌, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటుకు చేరున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, అమిత్‌ షా కూడా పార్లమెంట్‌కు హాజరయ్యారు.

  • బహీ ఖాతాలో ఏం దాచారో..
    ఇక వ్యాక్సిన్‌ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ జరగుతోంది. భారత్‌ ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచింది. ఈనేపథ్యంలో కరోనాతో ఏర్పడిన దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సమర్ధవంతమైన ‘వాక్సిన్‌’ను ప్రకటిస్తారని పలు రంగాలు ఎదురు చూస్తున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్‌లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు. 2019లో తన తొలి బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా బడ్జెట్‌ను లెదర్‌ బ్యాగ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని నిర్మల  తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలు