Free Petrol: చేపలు కొంటే.. లీటరు పెట్రోల్‌ ఫ్రీ

3 Aug, 2021 06:51 IST|Sakshi

సాక్షి, చెన్నై: చేపలు కొంటే లీటరు పెట్రోల్‌ ఉచితం అంటూ మదురైలో ఓ వ్యాపారి చేసిన ప్రకటనతో జనం క్యూ కట్టారు. మదురై బీబీ కులంలో అతి పెద్ద చేపల దుకాణం ఉంది. ఈ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పెరిగిన పెట్రోల్‌ ధరను దృష్టిలో ఉంచుకుని రూ.500లకు పైగా చేపలను కొంటే లీటరు పెట్రోల్‌ ఉచితం అంటూ దుకాణం ముందు బోర్డు పెట్టాడు. దీంతో ఆదివారం నుంచి ఈ దుకాణానికి జనం పోటెత్తారు. చేపలు కొన్న వారికి పెట్రోల్‌ కోసం కూపన్లు అందజేశారు.

మరిన్ని వార్తలు