సుశాంత్‌ మృతిపై  సీబీఐ విచారణ

5 Aug, 2020 04:23 IST|Sakshi

సిఫారసు చేశామన్న బిహార్‌ సీఎం నితీశ్‌

పట్నా/ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును ఎవరు చేపట్టాలనే దానిపై పట్నా, ముంబై పోలీసుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్‌ ట్విట్టర్‌లో ఈ మేరకు ప్రకటించారు. ‘సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ కూడా సీబీఐ దరాప్తునకు సమ్మతం తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీజీపీని కోరాను. ఈ రోజే ఈ కేసును సీబీఐ విచారణకు పంపుతాం’అని పేర్కొన్నారు.

సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం ఐపీఎస్‌ అధికారిని ముంబైకి పంపించాం. అక్కడి పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. సీబీఐ అయితేనే ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయగలదు’అని ఆయన వివరించారు. దీనిపై సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి తరఫు లాయర్‌ సతీశ్‌మానే షిండే స్పందించారు. ఎలాంటి సంబంధం లేకుండానే బిహార్‌ పోలీసులు ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తామనడం చట్టపరంగా చెల్లుబాటు కాదు. బిహార్‌ పోలీసులు నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్‌ను ముంబై పోలీసులకు మాత్రమే పంపగలరు’ అని  తెలిపారు.

మరిన్ని వార్తలు