74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య దేశంలో పుట్టడం మనందరి అదృష్టమని ఆయన అన్నారు. ఎందరో వీరుల ప్రాణ త్యాగాలు పోరాటల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది అని, వారందరిని ఈ సందర్భంగ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కరోనాలాంటి విపత్కర పరిస్థితులను దేశం ఎదుర్కొంటుందని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది వలస కార్మికులు, సామాన్యుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారందరిని ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. అలాగే గల్వన్ లోయలో చైనా చేసిన దురాక్రమణలను విజయవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ఐకమత్యంగా ఉండి దేశ ఉన్నతికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
Full text of #PresidentKovind’s address to the nation on the eve of the 74th Independence Day. 🇮🇳
English: https://t.co/MlTZ6otbQV
Hindi: https://t.co/DgPHHgRPFV pic.twitter.com/TBATnb9Z01
— President of India (@rashtrapatibhvn) August 14, 2020
దేశ ప్రజలందరికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి చెప్పిన మాటలు 130 మంది భారతీయులలో స్ఫూర్తిని నింపాయని కొనియాడారు. దేశ ప్రజలందరూ జాతి ఉన్నతికి, అభివృద్ధికి, సమగ్రతకు, ఐక్యతకు పాటు పడాలని మోదీ పిలుపునిచ్చారు.
#स्वतंत्रतादिवस के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
जय हिंद!
Happy Independence Day to all fellow Indians.
Jai Hind!
— Narendra Modi (@narendramodi) August 15, 2020
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Wishing my very good friend @PMOIndia @narendramodi and all the people of #IncredibleIndia a joyful #IndiaIndependenceDay .
You have so much to be proud of.स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं
🇮🇱🤝🇮🇳 pic.twitter.com/OaW7tHgKrH
— Benjamin Netanyahu (@netanyahu) August 14, 2020
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యానికి కారణమయిన అమరవీరులకు, దేశ భక్తులకు నా కృతజ్ఞతలు. మన దేశ విలువలు కాపాడుతూ, జాతి అభ్యున్నతికి పాటు పడతామని ఈ సందర్భంగా అందరం ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆయన ట్వీట్ చేశారు.
As India celebrates its 74th Independence day, I salute the great men & women whose unswerving determination & patriotism gifted us the freedom we relish today. Let's pledge to uphold & safeguard the values of our nation & contribute to its progress. Jai Hind! #IndependenceDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2020
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
समस्त देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।
🇮🇳 जय हिंद 🇮🇳 pic.twitter.com/OtvRzuWpzH
— Smriti Z Irani (@smritiirani) August 15, 2020
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ప్రజలందరికి ట్విట్టర్ వేదికగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.#IndependenceDayIndia2020 pic.twitter.com/EX8bSoWDpQ
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 15, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికి కృతజ్ఞతలు తెలిపారు.