Delhi: విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రం

15 Jun, 2021 10:01 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సోమవారం చెప్పారు. మందిర్‌ మార్గ్‌లోని నవ్‌యుగ్‌ పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకొని 28 రోజులు గడిచిన వారు ఈ కేంద్రానికి వచ్చి రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

వచ్చేవారు తమ పాస్‌పోర్టులను, ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేవారికి వేగంగా వ్యాక్సినేషన్‌ చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సెంటర్‌లో కోవిïÙల్డ్‌ వ్యాక్సిన్‌ వేస్తారని తెలిపారు. ఆగస్టు 31లోగా వెళ్లేవారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ చేస్తున్నట్లు చెప్పారు.

చదవండి: పీఎం కేర్స్‌ నిధులతో 850 ఆక్సిజన్‌ ప్లాంట్లు 

మరిన్ని వార్తలు