Electricity Demand: దేశంలో విద్యుత్‌ అత్యయిక పరిస్థితి

21 Feb, 2023 04:39 IST|Sakshi

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరనుందని అంచనాలున్న నేపథ్యంలో విద్యుత్‌ చట్టం 2003లోని సెక్షన్‌–11 కింద దేశంలో విద్యుత్‌ అత్యయిక పరిస్థితిని సోమవారం కేంద్ర ప్రభు­త్వం ప్రకటించింది. దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసి పవర్‌ ఎక్సే్ఛంజీలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

  • విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 11 కింద ప్రకటించిన కేంద్రం 
  • ఏప్రిల్‌లో దేశ విద్యుత్‌ డిమాండ్‌ 249 గిగావాట్లకు పెరగనుందని అంచనా 

వచ్చే ఏప్రిల్‌లో దే­శంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థా­యిలో పెరిగి 249 గిగావాట్స్‌కి చేరనుందని అంచనాలున్నాయని, ఈ మేర­కు విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు ది­గుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మ­ల్‌ వి­ద్యుత్‌ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిరంతరం ఉత్పత్తి కొనసాగించాలని కోరింది. అసాధార­ణ పరిస్థితుల్లో సెక్షన్‌–11ను ప్రయోగించి తమ సూ­చనల మేరకు విద్యుదుత్పత్తి జరపాలని విద్యు­త్‌ కేంద్రాలను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది. గతేడాది వేసవిలో సైతం కేంద్రం సెక్షన్‌–11ను ప్ర­యోగించి దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు