నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి

19 Jun, 2021 14:03 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: చెన్నై వండలూరు జూలోని తెల్లపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలను ప్రత్యేక బోనులో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తున్నారు. కాగా ఓ పిల్లపై తల్లి పంజా తగలడంతో గాయమైంది. వైద్యులు చికిత్స చేస్తున్నారు. మిగిలిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ సిబ్బంది తెలిపారు.  

మరిన్ని వార్తలు