పోలీసులకు రోజూ రెండు గంటలు సైకిల్‌ గస్తీ తప్పనిసరి: కమిషనర్‌

10 Dec, 2021 15:18 IST|Sakshi

పోలీసులకు కమిషనర్‌ ఆదేశాలు 

సాక్షి, చెన్నై: జీపులు, మోటారు సైకిళ్లను పక్కన పెట్టి సైకిల్‌పై గస్తీ వెళ్లేందుకు నగర పోలీసులు రెడీ అయ్యారు. ఇందుకోసం ఒక్కో స్టేషన్‌కు 4 చొప్పున సైకిళ్లను పంపిణీ చేశారు. రోజుకు 2 గంటలు సైకిల్‌ గస్తీ తప్పనిసరి చేస్తూ కమిషనర్‌ శంకర్‌జివ్వాల్‌ ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు గంటల పాటు తమ పరిధిలో సైకిల్‌ టీం గస్తీ నిర్వహించనున్నారు. తద్వారా నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. 

చదవండి: (ట్రాఫిక్‌ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్‌ రోడ్‌’ పూర్తి..)

మరిన్ని వార్తలు