దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్య.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు

5 Aug, 2021 11:57 IST|Sakshi
మావోయిస్టుల దాడిలో ధ్వంసమైన బొలెరో వాహనం

ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గోతియా అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో నారాయణపూర్‌ జిల్లా నుంచి  దంతేవాడ వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు