రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్‌ భేటీ.. విషయమిదే..

26 May, 2023 15:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి కేంద్రంపై పోరుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే కేంద్రం తెచ్చిన ఆర్ఢినెన్స్‌పై పోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేజ్రీవాల్‌ భేటీ కానున్నారు. దీని కోసం రేపు(శనివారం) కేజ్రీవాల్‌ హైదరాబాద్‌కు రానున్నారు.

అయితే, ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీఎం కేజ్రీవాల్‌ ప్రతిపక్ష నేతల మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. ఇక, ఈ విషయమై కేజ్రీవాల్‌ ఇప్పటికే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రేలతో కలిసి చర్చించారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ను దించే ప్లాన్‌ ఏంటి?

మరిన్ని వార్తలు