ధోనీ రిటైర్‌మెంట్ ‌: సీఎం స్పందన

16 Aug, 2020 14:34 IST|Sakshi

చెన్నై : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించటంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఆదివారం ధోనీని ఉద్ధేశిస్తూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘‘ 331 అంతర్జాతీయ మ్యాచుల్లో భారత క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహించటంతో పాటు కెప్టెన్‌ కూల్‌గా దేశానికి మూడు ఛాంపియన్‌షిప్‌లు గెలిపించినందుకు ఎంఎస్‌ ధోనీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతడి విజయాలు, కీర్తి ప్రతీ భారతీయుడికి చిరస్మరణీయం’’ అని పేర్కొన్నారు.
( ఆ సిక్స‌ర్‌ను ఎలా మ‌ర్చిపోగ‌ల‌ను? )

మరిన్ని వార్తలు