భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్​ కీలక నేత..

9 Jun, 2021 13:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ సీనియర్ నేత జితిన్​ ప్రసాద తాను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు, ఆయన ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్​ ఇంటికి చేరుకొని తన నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో జితిన్​ ప్రసాద యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉక్కు మంత్రిత్వ శాఖను నిర్వహించారు.  2019 కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్‌ కీలకంగా వ్యవహరించారు.

అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద..‘ బ్రాహ్మిన్​ చేత్​న పరిషత్​’ను గత సంవత్సరం ప్రారంభించారు. తాజాగా, ఆయనను కాంగ్రెస్​ పార్టీ ఏఐసీసీ వెస్ట్​బెంగాల్​ జనరల్​ సెక్రెటరీగా నియమించింది. ఇలాంటి తరుణంలో జితిన్ ​ప్రసాద బీజేపీలోకి చేరుతుండటం రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఉత్తర ప్రదేశ్​లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక కీలకంగా మారింది. 

చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్‌.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం

మరిన్ని వార్తలు