‘ట్విటర్‌ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్‌ నాయకులు

17 Aug, 2021 17:01 IST|Sakshi

సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓ పక్షిపై చూయించారు. ఆ పక్షిని బలి తీసి ఉప్పుకారం మసాలాలు దట్టించి సలసల మాగే నూనెలో వేయించారు. అనంతరం ఆ మాంసాన్ని ట్విటర్‌ ప్రధాన కార్యాలయానికి పోస్టు చేశారు. ఇదంతా చేసింది రాహుల్‌ ఖాతాను ట్విటర్‌ నిలిపివేయడానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమం వైరల్‌గా మారింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తుంటే.. మరికొందరు హర్షిస్తున్నారు. ఇంతకీ ఆ పక్షిని కాల్చి వండుకుతిన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, అతడి అనుచరులే. (చదవండి: ఎట్టకేలకు రాహుల్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ)

రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్‌ వారం నిషేధించిన అనంతరం పునరుద్ధరించింది. వరుసగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ ట్విటర్‌ లోగోలో ఉండే పక్షి పిచ్చుక. ట్విటర్‌పై కోపంతో పిచ్చుకను కాల్చి మాంచిగా వండారు. ఫ్రై చేస్తూనే తాము ఎందుకు ఈ విధంగా చేస్తున్నామో తెలిపారు. ‘రాహుల్‌గాంధీ ట్విటర్‌ ఖాతా నిలుపుదల చేసి ట్విటర్‌ నిర్వాహకులు తప్పు చేశారు. కాంగ్రెస్‌ ట్వీట్లను ప్రమోట్‌ చేయడం లేదు. బీజేపీ చేసిన కుట్రతోనే ట్విటర్‌ కాంగ్రెస్‌ నాయకుల అకౌంట్లను బ్లాక్‌ చేసింది’ అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు బీజేపీ డౌన్‌డౌన్‌ అని నినదించారు. ట్విటర్‌ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని కాంగ్రెస్‌ శ్రేణులు హితవు పలికారు. చివరకు వండిన ఆ మాంసాన్ని ఒక డబ్బాలో పెట్టి గురుగ్రామ్‌లోని ట్విటర్‌ కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు. తపాలా కార్యాలయానికి వెళ్తున్నవరకు వీడియో ఉంది. అనంతరం వారు ఆ బాక్స్‌ పోస్టు చేశారు.

చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్‌.. జైల్లోనే


మరిన్ని వార్తలు