బెంగళూరు: అకాల వర్షాలతో బెంగళూరు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలో వరద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐతే ఆ సమావేశంలో కర్ణాటక మంత్రి ఆర్ ఆశోక్ నిద్రపోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేస్తూ.... విమర్శల దాడికి దిగింది. రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలతో మునిగిపోతుంటే.... మంత్రి నిద్రమత్తులో మునిగిపోతున్నారంటూ కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు.
వాస్తవానికి కర్ణాటక మంత్రి ఆశోక్ కుమార్ కూడా సోమవారం, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగిన వరద సమీక్ష సమావేశానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో పంచుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు జిల్లాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అంతేకాదు ఆ సమావేశంలో బెంగళూరు ప్రజలను వరదల పరిస్థితి నంచి గట్టేక్కించేందుకు ప్రభుత్వం తన వంతు తోడ్పాటును అందించే నిమిత్తం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేయాలని సీఎం బొమ్మె నిర్ణయించినట్లు పేర్కొన్నారు కూడా.
ಮುಳುಗುವುದರಲ್ಲಿ ಹಲವು ವಿಧಗಳಿವೆ!
ರಾಜ್ಯದ ಜನ ಮಳೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ,
ಸಚಿವರು ನಿದ್ದೆಯಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದಾರೆ!ಪ್ರವಾಹ ಪರಿಶೀಲನೆಯ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ನಲ್ಲಿ ಸಚಿವ @RAshokaBJP ಅವರ ಭರ್ಜರಿ ನಿದ್ದೆ.
'ಹಲಾಲ್ ಕಟ್' ಎಂದರೆ ಥಟ್ನೆ ಎಚ್ಚರಾಗುತ್ತಾರೆ!'ಚಿಂತೆ ಇಲ್ಲದವಗೆ ಸಂತೆಲೂ ನಿದ್ದೆ' ಎಂಬ ಮಾತು ಸಚಿವರಿಗೇ ಹೇಳಿದ್ದೇನೋ! pic.twitter.com/e11pzCibwZ
— Karnataka Congress (@INCKarnataka) September 6, 2022
ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರೊಂದಿಗೆ ಪ್ರವಾಹ ಪೀಡಿತ ಜಿಲ್ಲೆಗಳ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ವಿಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ ನಡೆಸಿ, ರಕ್ಷಣೆ ಮತ್ತು ಪರಿಹಾರ ಕಾರ್ಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ ನಡೆಸಲಾಯಿತು. @BSBommai @BJP4India @CMofKarnataka pic.twitter.com/e7BEd6wwRt
— R. Ashoka (ಆರ್. ಅಶೋಕ) (@RAshokaBJP) September 5, 2022
(చదవండి: బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు)