Covid: 43 వేల కేసులు.. 930 మంది మృతి

7 Jul, 2021 10:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల్లో, మరణాల్లో కొద్దిగా పెరుగుదల కనిపిస్దోంది. గడిచిన 24 గంటల్లో 43,733 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్‌తో 930 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 47,240 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం 4,,59,920.యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,06,63,655కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,04,211 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2,98 కోట్ల మంది కోలుకున్నారు. మంగళవారం నాడు 16,47,424 మంది పరీక్షలు చేసుకున్నారు. ఇప్పటి వరకు 42,14,24,881 మందికి టెస్టులు చేశారు. ప్రస్తుతం రికవరీరేటు 97.17కు పెరిగింది. 

మరిన్ని వార్తలు