న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షల 04వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 584 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,32,162కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,794 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,807 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు 84,28,410 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.60 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.47శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల శాతం 4.93గా ఉంది. (కోవిడ్-19 నిర్ధారణకు టాటా ఎండీ ‘చెక్’)