దేశ రాజధానిలో కొత్తగా 4,473 మందికి కరోనా

16 Sep, 2020 21:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు 2,30, 000 దాటాయి. గడచిన 24 గంటలలో 4,473 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క రోజు 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 2,30,269గా ఉండగా మృతుల సంఖ్య 4,839కు చేరింది. మంగళవారం 3,313 మంది డిశ్ఛార్జ్ అవ్వగా మొత్తం 1,94,516 మంది డిశ్చార్జి అయ్యారు. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు)

ప్రస్తుతం ఢిల్లీలో 30,914 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈరోజు నిర్వహించిన కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య 11,275 ర్యాపిడ్ టెస్టుల సంఖ్య 51,318. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య  23,09,578కు చేరింది. హోం ఐసోలేషన్‌లో 17,324 మంది ఉండగా.. ఢిల్లీలో 1637 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ప్రతి  మిలియన్ జనాభాకు  1,21,556 కరోనా టెస్టులు చేస్తున్నారు. (అక్టోబ‌ర్ 1 నుంచి థియేట‌ర్లు ఓపెన్‌?)

>
మరిన్ని వార్తలు