24 గంటల్లో 23,950 కొత్త కేసులు

23 Dec, 2020 11:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ వ్యాది అదుపులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య కోటి 99 వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,950 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 333 మంది మృద్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,00,99,066కు చేరింది. ఇప్పటి వరకు 1,46,444 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 26,895 మంది డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటివరకు 96,63,382 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2,89,240 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు1.49, , రికవరీ రేటు 95.69, యాక్టివ్‌ కేసుల రేటు 2.86గా ఉన్నాయి. చదవండి: బ్రిటన్‌ కొత్త వైరస్ టెస్టులకు దొరకదా?

మరిన్ని వార్తలు