న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,916 పాజిటివ్ కేసులు నమోవదగా, 757 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,36,861కు చేరగా, మృతుల సంఖ్య 31,358కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 4,56,071 కేసులు యాక్టివ్గా ఉండగా, 8,49,431 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శుక్రవారం మాత్రమే 4,20,898 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నిర్వహించిన టెస్టుల సంఖ్య 1,58,49,068కు చేరింది.