న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 91,702 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదు అయిన కోవిడ్ కేసుల సంఖ్య 2,92,74,823గా ఉంది. కాగా కరోనా మరణాల సంఖ్య ఒక్కరోజులో 3,403గా నమోదయింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,63,079గా ఉంది.
గత 24 గంటల్లో 1,34,580 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,77,90,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 11,21,671 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 24.60 కోట్ల మందికి పైగా కరోనా వాక్సిన్ అందించారు.
చదవండి: కోవిడ్ టీకా డోస్ల వృథాలో జార్ఖండ్ టాప్