Corona Virus: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు

1 Feb, 2022 09:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి  కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మరణాల సంఖ్య పెరగడం ఒకింత ఆం‍దోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటలలో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,54,076మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 1192 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం 17,43,059 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.69% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,68,48,204 మంది వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నారు. 

చదవండిః మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని..

మరిన్ని వార్తలు