Covid And Omicron: కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తగ్గిన పాజిటివిటీ రేటు

2 Feb, 2022 10:06 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి  కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,81,109 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,95,11,307 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 

ప్రస్తుతం 16,21,603 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.26% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 167.29 కోట్ల మంది వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు