భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు

30 Apr, 2022 10:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక్కసారిగా పడిపోయాయని సంతోషించేలోపే.. కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 3,668 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 50 మంది కరోనాతో మృతి చెందారు.

శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..  దేశ రాజధానిలో ఢిల్లీ కేసుల పెరుగుదల కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం 3,668 కేసుల్లో.. 1, 607 కేసులు, రెండు మరణాలు ఢిల్లీలోనే నమోదు అయ్యాయి.  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌కేసుల సంఖ్య 18, 684గా ఉంది. దేశం మొత్తం మీద ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వాళ్ల సంఖ్య 5,23,803గా నమోదు అయ్యింది.

మరిన్ని వార్తలు