దేశంలో కొత్తగా 22,065 కరోనా కేసులు

15 Dec, 2020 10:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 99 లక్షలు దాటింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 22,065 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో  మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,06,165కు చేరింది. అదే విధంగా  గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 354 మంది మృతి చెందారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి  వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 94,22,636గా ఉంది. చదవండి: కరోనా ఎఫెక్ట్..‌ నటికి పక్షపాతం

ఇప్పటివరకు మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 1,43,709కు చేరింది. ప్రస్తుతం దేశంలో దేశంలో 3,39,820 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నవంబర్‌ తొలివారంలో రోజు 4.3 శాతం కోవిడ్‌ కేసులు నమోదైతే.. డిసెంబర్‌ 7 నుంచి 13 వరకు 3.16 శాతం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. చదవండి: టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Poll
Loading...
మరిన్ని వార్తలు