కరోనా తగ్గుముఖం: దేశంలో కొత్తగా 41,506 కేసులు

11 Jul, 2021 10:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజగా గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 41,506 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24గంటల్లో కరోనాతో 895 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్‌తో మృతి చెందినవారి మొత్తం సంఖ్య 4,08,040కి చేరింది.

గడిచిన ఒక్కరోజులో 41,526 మంది కరోనా నుంచి కోలుకొని వివిధ అస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,99,75,064కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,54,118 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 37.60 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు