దేశంలో ‍స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

10 Feb, 2022 10:27 IST|Sakshi

Coronavirus Update: దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య బుధవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,084 కొత్త  కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత24 గంటలలో 1,67,882 మంది వైరస్‌ బారినుంచి కోలుకోగా 1,241 మంది కరోనాతో మృతి చెందారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,06,520 మంది కోవిడ్‌ బారినపడి మరణించారు. ప్రస్తుతం7,90,789 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.4 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,71,28,19,947 మంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నారు.

మరిన్ని వార్తలు