సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 71 రోజుల్లో అత్యంత తక్కువ రోజువారీ పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,94,39,989కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,303 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,70,384 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,32,062 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,80,43,446 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,26,159 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 25.31 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ అందించారు.
చదవండి: థర్డ్ వేవ్ను తరిమేసేలా..!