గుడ్‌ న్యూస్‌: దేశంలో భారీగా తగ్గిన కొత్త కేసులు

8 Jun, 2021 10:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,498 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో 63 రోజుల తర్వాత రోజువారి కొత్త కేసులు సంఖ్య లక్ష కన్నా తక్కువగా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 2,89,96,473కు పెరిగింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 2123 మంది కరోనా బాధితులు మరణించగా, ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309కు పెరిగింది.

దేశంలో గత 24 గంటల్లో 1,82,282 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 2,73,41,462 మంది కోవిడ్‌ బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 13,03,702 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉ‍న్నాయి. గత 24 గంటల్లో 18,73,485 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 36,82,07,596 మందికి కరోనా పరీక్షలు చేశారు. దేశంలో ఇప్పటివరకు 23.61 కోట్లకుపైగా వ్యాక్సినేషన్‌ అందించారు.

చదవండి: అందరికీ ఉచితంగా కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌

మరిన్ని వార్తలు