ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

4 Dec, 2020 13:34 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. భారత్‌లోనూ విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో కోవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో  35,551 మంది కోవిడ్‌ బారిన పడగా, 526 మరణాలు సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జారీచేసిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 95.3 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 4,22,943గా  నమోదైంది. ఇప్పటి వరకు 89,73,373 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. అయితే రాజధాని ఢిల్లీలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించబోమని, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని  ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది..

తెలంగాణలో 631 కొత్త కేసులు, ఇద్దరి మరణం
డిసెంబర్ 3 రాత్రి 8 గంటల వరకు ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్తగా 631 కోవిడ్‌ కేసులు నమోదుతో, కేసుల సంఖ్య 2.72 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటికి కొత్తగా నమోదైన రెండు మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 1,467 చేరుకుంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో అత్యధికంగా 109 కేసులు నమోదయ్యాయి. తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (57), రంగారెడ్డి (49) కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు 8,826 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 57,405 నమూనాలను గురువారం పరీక్షించారు.​

అస్సాంలో 165 కొత్త కోవిడ్‌ కేసులు 
అస్సాం రాష్ట్రంలో కొత్తగా 165 కోవిడ్‌ కేసులు నమోదుతో, కేసుల సంఖ్య 2,13,336 కు చేరుకున్నాయి. వారిలో 177 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 2,08,843 కు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య 3,505 కాగా, ముగ్గురు రోగులు రాష్ట్రం నుండి వలస వచ్చారు. రాష్ట్రంలో రికవరీ రేటు ప్రస్తుతం 97.89 శాతంగా ఉంది.’’ అని కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు..
  

మరిన్ని వార్తలు