India Covid-19 Updates: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 10% దాటిన పాజిటివిటీ

3 Feb, 2022 10:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య బుధవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటలలో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,59,107 మంది వైరస్‌ బారి నుంచి కోలుకోగా, 1008 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,98,983 మంది కోవిడ్‌ బారినపడి మరణించారు.

ప్రస్తుతం 15,33,921 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 167.87 కోట్ల మంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నారు.

మరిన్ని వార్తలు