కరోనా : 57 వేలకు పైగా కేసులు..

1 Aug, 2020 10:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. రోజూ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాట‌డం సాధార‌ణమైన విష‌యంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రోసారి రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. శుక్రవారం ఒక్క  రోజే అత్యధికంగా 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. (చదవండి :  కరోనా టీకా కోసం రూ.15,725 కోట్లు)

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 16,95,988కి చేరింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 764 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 36,5112కు చేరింది. ఇక గత 24 గంటల్లో 36,569 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాపంగా రికవరీ రేటు 64.3శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,65,103 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీల్లో అత్య‌ధిక క‌రోనా కేసులు నమోదవుతున్నాయి.
(చదవండి : వ్యాక్సిన్‌ వచ్చే వరకు అదొక్కటే మార్గం)

>
మరిన్ని వార్తలు