సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో16.66 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది.
చదవండి: మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
దేశంలో ప్రస్తుతం 14,17,820 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041 చేరింది.