COVID-19: కరోనా కొత్త కేసులు 1,805

28 Mar, 2023 06:06 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్‌ కేసులు 134 రోజుల తర్వాత 10 వేల మార్కు దాటాయంది.

రోజువారీ పాజిటివిటీ రేట్‌ 3.19%, వీక్లీ పాజిటివిటీ రేట్‌ 1.39 శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసులు 10,300కు పెరిగినట్లు వెల్లడించింది. చండీగఢ్, గుజరాత్, హిమాచల్, యూపీ, కేరళల్లో ఆరుగురు చనిపోయారు.

మరిన్ని వార్తలు