కోవిడ్​ కేర్​ సెంటర్​లో మహిళ ఆత్మహత్య..

7 Jun, 2021 11:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గంగావతి(కర్ణాటక): కోవిడ్​ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్​ కావాల్సిన ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గదగ్​కు చెందిన రోహిణి కాల్మేశ్వరయ్య (48) గత నెలలో గంగావతిలోని ఓ వైద్యురాలి ఇంటికి వచ్చింది. మే 23న ఆమెకు కరోనా సోకగా కోవిడ్​ కేర్​ సెంటర్​లో చికిత్స చేయించగా నెగిటివ్​ వచ్చింది.

అయితే, తిరిగి ఈనెల 2న మళ్లీ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అనెగుంది రస్తాలో ఉన్న కోవిడ్​ కేర్​ సెంటర్​లో చేరింది. సోమవారం ఆమె డిశ్చార్జ్​ కావాల్సిఉంది. అయితే, ఆదివారం తెల్లవారు జామున కోవిడ్​కేర్​ సెంటర్​లో కిటికీకి చీరతో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. 
చదవండి: Lockdown​: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం

మరిన్ని వార్తలు