రెండోదఫా చెలరేగుతున్న మహమ్మారి
తాజాగా 14,738 పాజిటివ్లు
రాష్ట్రవ్యాప్తంగా 66 మంది మృతి
బెంగళూరులోనే 10 వేల కేసులు
సాక్షి, బెంగళూరు: మహమ్మారి కరోనా రెండో ఉధృతి కర్ణాటకలో కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత విజృంభించిన రీతిలో ఇప్పుడు కోవిడ్ హల్చల్ చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 14,738 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. కేసులతో పోలిస్తే చాలా తక్కువగా 3,591 మంది కోలుకున్నారు. రికార్డుస్థాయిలో 66 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.
11 లక్షలు దాటిన కేసులు..
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,09,650కు పెరిగింది. అందులో 9,99,958 మంది కోలుకున్నారు. మరణాలు 13,112 కి పెరిగాయి. ప్రస్తుతం 96,561 మంది చికిత్స పొందుతుండగా అందులో 555 మంది ఐసీయూలో ఉన్నారు.
రాజధానిలో 10,497
మరణాలు ఎక్కడెక్కడ ఎన్ని?
కరోనాపై డీజీపీకి హైకోర్టు ఆదేశాలు
శివాజీనగర: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కట్టడికి కఠిన చర్యల్ని తీసుకోవాలని డీజీపీ ప్రవీణ్ సూద్కి హైకోర్టు ఆదేశించింది. పలు పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్.ఓకా, న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ల డివిజనల్ బెంచ్ విచారణ జరిపింది. అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘించేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జరిమానాలను వసూలు చేయాలని ఆదేశించింది. దీనిపై అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీకి సూచించింది.