వ్యాక్సిన్ వేసుకోవడానికి అత్యధిక భారతీయులు తొలుత విముఖత చూపినా.. రోజులు గడిచేకొద్దీ వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జనవరి, మార్చిలో రెండుసార్లు నిర్వహించిన సర్వేలో తేలినట్లు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ యుగవ్ తెలిపింది. సర్వే కోసం ఈ సంస్థ పట్టణ ప్రాంత ప్రజల ముందు పలు ప్రశ్నలను ఉంచింది.
తొలి సర్వే డిసెంబర్ 29–జనవరి 2 మధ్య చేపట్టగా.. మలి సర్వే మార్చి 23–28 మధ్య నిర్వహించింది. అయితే, ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగిన నేపథ్యంలో టీకా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసే వారి సంఖ్య సదరు సర్వేతో పోలిస్తే.. మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సర్వేలో మనోళ్లు ఏమన్నారో చూద్దామా..