మరోసారి 40 వేలకు దిగువకు కేసులు

5 Jul, 2021 11:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 39, 796 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్‌తో 723 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ అందించిన సమాచారం మేరకు గత మూడు నెలల్లో ఇంత తక్కువలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజే 42,352 మంది కోలుకున్నారు  ప్రస్తుతం 4,82,071 యాక్టివ్‌ కేసులున్నాయి.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,05,85,229కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,02,728 మంది ప్రాణాలు  కోల్పోయారు. మొత్తం 2,97,00,430 మంది కోలుకున్నారు. ఆదివారం నాడు 15,22,504 మంది పరీక్షలు చేసుకున్నారు. ప్రస్తుతం రికవరీరేటు 97.11గా ఉంది. 

మరిన్ని వార్తలు