పిల్లలకు ‘మూడో ముప్పు’ తక్కువే..
డబ్ల్యూహెచ్వో, ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: పిల్లలపై కరోనా మూడో వేవ్ ప్రభావం మరీ భయపడినంత స్థాయిలో ఉండకపోవచ్చని వెల్లడైంది. పిల్లల్లో గతంలో ఇన్ఫెక్షన్ సోకిన (సీరో పాజిటివిటీ) రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉన్న కారణంగా.. కరోనా మూడో వేవ్ ముప్పు పిల్లల్లో తక్కువగానే ఉంటుందని తాజా అధ్యయనం ప్రాథమికంగా తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కలిసి ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై ఈ అధ్యయనం చేస్తున్నాయి. ఇతరుల కన్నా పిల్లలపై మూడో వేవ్ ముప్పు అధికంగా ఉంటుందని ఆందోళనకర వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ స్టడీ ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు.. కొంతవరకు ఆ భయాలను తొలగించే అవకాశముంది.
ఈ అధ్యయనంలో ఎలీసా కిట్స్తో శరీరంలో కోవిడ్ యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. మన శరీరంలో వైరస్లపై పోరాడే సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటివిటీగా పేర్కొంటారు. ఈ అధ్యయనానికి ఎయిమ్స్ ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించింది. డేటా అందుబాటులో ఉన్న 4,509 మంది వలంటీర్లలో 700 మంది 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారు కాగా.. మిగతా వారు 18 ఏళ్ల వయసువారు. వారి సగటు వయసు ఢిల్లీ (అర్బన్)లో 11, ఢిల్లీ (రూరల్)లో 12, భువనేశ్వర్ (ఒడిశా)లో 11, గోరఖ్పూర్ (యూపీ)లో 13, అగర్తల (త్రిపుర)లో 14గా ఉంది. వీరి నుంచి ఈ సంవత్సరం మార్చ్ 15 నుంచి జూన్ 10వ తేదీ మధ్య వివరాలు సేకరించారు.
‘పిల్లల్లో సీరో పాజిటివిటీ’ రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ప్రస్తుతమున్న వేరియంట్ల ద్వారా వచ్చే మూడో వేవ్ రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువ’’ అని ఆ స్టడీ తేల్చింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, డిపార్ట్మెంట్ ఆఫ్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్లు పునీత్ మిశ్రా, శశికాంత్, సంజయ్ కే రాయ్ తదితరులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
స్టడీ ప్రాథమికంగా నిర్ధారించిన ముఖ్యాంశాలు