జీపీఎస్తో అనుసంధానం
సమీపంలోని టీకా కేంద్రాలు తెలుసుకునే అవకాశం
వెళ్లాల్సిన కేంద్రానికి సులభంగా చేరుకునే అవకాశం
కరోనా టీకా సాఫ్ట్వేర్ను ఆధునీకరించిన కేంద్రం
ఇందులో నమోదు చేసుకుంటేనే టీకా
వారం తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ కోవిన్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించింది. కోవిన్-2.0ను సిద్ధం చేసింది. దానిని జీపీఎస్కు అనుసంధానం చేసింది. దీంతో టీకా లబ్ధిదారులు వ్యాక్సిన్ కేంద్రాలు తమకు సమీపంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్లేందుకు వీలవుతుంది. గూగుల్ మ్యాప్ ద్వారా ఎలాగైతే మనం అవసరమైన చోటకు వెళ్తామో, కోవిన్ యాప్ ద్వారా మనకు సమీపంలో ఉన్న టీకా కేంద్రానికి వెళ్లడానికి అది అవకాశం కల్పిస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. టీకా కేంద్రాలకు నేరుగా వచ్చి అక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సిన్ వేయించుకునే పద్ధతి ప్రస్తుతానికి లేదు. వారం రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ మొదలయ్యాక టీకా కేంద్రంలో నమోదు కార్యక్రమం చేపడతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందువల్ల అప్పటివరకు ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారు, 45-59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక రోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
ఎలా నమోదు చేసుకోవాలి?
చదవండి: