తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

4 Feb, 2023 15:54 IST|Sakshi

ఢిల్లీ: సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ నివాసంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌  తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌బీర్‌ కుమార్‌ (53) సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతలో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని  పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు