కరోనా విజృంభణ; ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

24 Sep, 2020 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. దేశ రాజధానిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల  60 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 3,834 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,60,623కు చేరింది. నిన్న ఒక్క రోజే 36 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 5,123 మృత్యువాత పడ్డారు. బుధవారం 3,509 మంది కోలుకోగా ఈ రోజు వరకు 2,24,375 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 31,125 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక టెస్టుల విషయానికొస్తే రాష్ట్రంలో 27,56,516 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (కరోనాతో పద్మశ్రీ శేఖ‌ర్ బ‌సు కన్నుమూత)

>
మరిన్ని వార్తలు