ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌!

22 Mar, 2021 12:42 IST|Sakshi

హోలీ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే యోచనలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నవంబర్‌ నుంచి కోవిడ్‌ కేసులు తగ్గినప్పటికి.. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ జాబితాలో చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో రానున్న హోలీ పండగ నేపథ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు‌ కనిపిస్తున్నాయి. ఈనెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలకు విధించాలని సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో మార్చి 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు. .

ఇక ఢిల్లీలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 4,288 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విపత్తు నిర్వహణ అథారిటీ కాసేపట్లో సమావేశం కానుంది. పెరుగుతున్న కోవిడ్ కేసులపై జరగనున్న చర్చించనుంది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ గురించి జనాలను హెచ్చరిస్తోంది. టీకా తీసుకోవాలని.. జాగ్రత్తలు పాటించాలని కోరుతుంది.

చదవండి:
రాష్ట్రంలో హోలీ, డోలోత్సవం రద్దు

మరిన్ని వార్తలు