ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రాజీనామా! వ్యక్తిగత కారణాలతోనే..

18 May, 2022 17:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించారాయన.

2016 నుంచి అనిల్‌ బైజల్‌ ఢిల్లీ ఎల్జీగా కొనసాగుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆయనకు విబేధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కీలక నిర్ణయాలకు సైతం ఎల్జీ హోదాలో అనిల్‌ బైజల్‌ బీజేపీ పర్యవేక్షణతోనే అడ్డుపుల్లలు వేస్తున్నారనే విమర్శలు చేసింది ఆప్‌ సర్కార్‌.

మరిన్ని వార్తలు