Delhi Liquor Scam: 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు

16 Sep, 2022 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అరుణ్‌రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయిన్‌పల్లి, బుచ్చిబాబు, చందన్‌రెడ్డి, పెర్రాయి రిచర్డ్‌, విజయ్‌నాయర్‌, సమీర్‌ మహంద్రు, దినేష్‌ అరోరా, వై.శశికళ, రాఘవ మాగుంటకు నోటీసులు జారీ అయ్యాయి. 

ఇండో స్పిరిట్స్‌, మాగుంటి ఆగ్రోఫామ్స్‌ ట్రైడెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్స్‌, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్‌, ఆర్గానమిక్స్‌ ఈకోసిస్టమ్‌ లిమిటెడ్స్‌, అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఎన్రికా ఎంటర్‌ ప్రైజెస్‌, ప్రీమిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, బైనాబ్‌ట్రైడింగ్‌ ప్రై. లిమిటెడ్‌, బాలాజీ డిస్టిలరీస్‌, టెక్రా, పెరల్‌ డిస్టిలరీస్‌, హివిడే ఎంటర్‌ ప్రైజెస్‌, వైకింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, డైయాడిమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, డిప్లొమాట్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, పెగాసస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, రాబిన్‌ డిస్టిలరీస్‌ ఈడీ నోటీసులు జారీ చేసింది.
చదవండి: లిక్కర్‌ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్‌ టెన్షన్‌!

సాక్షి, హైదరాబాద్‌: అనూస్‌ బ్యూటీ పార్లర్‌ హెడ్‌ ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుపుతోంది. మాదాపూర్‌లోని అలైఖ్య ప్రవణవ్‌ హోమ్స్‌లో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మరిన్ని వార్తలు