రూ.1,000 కోట్లు విలువైన డ్రగ్స్‌ పట్టివేత

17 Aug, 2022 08:31 IST|Sakshi

అహ్మదాబాద్‌:  గుజరాత్‌లో మరోమారు భారీస్థాయిలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం రూ.1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ మంగళవారం పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వడోదరలోని ఓ గోదాంపై దాడి చేపట్టింది యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌. ఈ దాడుల్లో 200 కిలోల మెఫెడ్రోన్‌ దొరికినట్టు అధికారులు తెలిపారు. భరుచ్‌ జిల్లాలో ఔషధాల ముసుగులో దీన్ని తయారు చేసినట్టు తేలిందన్నారు. ఇందుకు సంబంధించి పలువురికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిషేధిత మెఫెడ్రోన్‌ను మ్యావ్‌ మ్యావ్, ఎండీగా కూడా పిలుస్తారు.

ఇదీ చదవండి: ఎంఎస్‌పీ కమిటీ భేటీని బహిష్కరించిన రైతు సంఘాలు

మరిన్ని వార్తలు